అనిల్ సుంకర నిర్మాణంలో మెహర్ రమేష్ – చిరు ప్రాజెక్టు.. ఇక నో డిలే..!

  • September 13, 2020 / 08:18 PM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన ఈ చిత్రం షూటింగ్.. త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం తరువాత మరో మూడు ప్రాజెక్టులను చిరు లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. వినాయక్ డైరెక్షన్లో ‘లూసిఫర్’ రీమేక్, బాబీ డైరెక్షన్లో ‘మైత్రి’ వారి నిర్మాణంలో ఒక ప్రాజెక్టు, అలాగే మెహర్ రమేష్ డైరెక్షన్లో ‘వేదాలం’ రీమేక్ ఒకటి కావడం విశేషం.

వీటిలో మొదట మెహర్ రమేష్ డైరెక్షన్లో ‘వేదాలం’ రీమేక్ మొదట సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందనేది తాజా సమాచారం. ఈ ఏడాది మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత అనిల్ సుంకర ఈ ప్రాజెక్ట్ ను సుమారు 80కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నట్టు సమాచారం. సోమవారం రోజున అంటే సెప్టెంబర్ 14న లేదా .. వచ్చే వారం ముగిసేలోపు ‘ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్’ వారు అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

మొన్నటికి మొన్నశర్వానంద్ – అజయ్ భూపతి ల ‘మహాసముద్రం’ ప్రాజెక్టు, అలాగే అఖిల్ -సురేంద్ర రెడ్డి ప్రాజెక్టుల గురించి అధికారిక ప్రకటన ఇచ్చారు ‘ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్’ వారు..! ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టు గురించి అనౌన్స్మెంట్ ఇవ్వడానికి రెడీ అయిపోయినట్టు సమాచారం.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus