Chiranjeevi: కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ చిరు ఆసక్తికర పోస్ట్.. ఏమైందంటే?

  • January 2, 2024 / 12:31 PM IST

మెగాస్టార్ చిరంజీవి గతేడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోగా భోళా శంకర్ మాత్రం ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. ఫ్యాన్స్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చిరంజీవి తన ట్విట్టర్ పోస్ట్ లో 2023 సంవత్సరం తెలుగు సినిమాకు, ఇండియన్ సినిమాకు చారిత్రాత్మక సంవత్సరంగా చెప్పుకోవచ్చని అన్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీ ఎన్నో రకాలుగా విజయాలను అందుకుందని ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ జాతీయ పురస్కారాలు, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విజయాలను అందుకున్నామని చిరంజీవి కామెంట్లు చేశారు. వైవిధ్యం ఉన్న కథా చిత్రాలతో సరిహద్దులను దాటామని 2023 సంవత్సరంలో సాధించిన విజయాలు, పురస్కారాలతో టాలీవుడ్ స్థాయి ప్రపంచ పటంలో నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు.

మన స్థాయి పెద్దదని మరిన్ని మంచి విజయాలను సాధించడానికి కలలు కనే ధైర్యం చేయవచ్చని వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చని చిరంజీవి ట్వీట్ ద్వారా వెల్లడించారు. గుడ్ బై 2023 వెల్ కమ్ 2024 హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్ అంటూ చిరంజీవి చేసిన ట్వీట్ కు 16000 లైక్స్ వచ్చాయి. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర టైటిల్ తో వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు.

300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. చిరంజీవికి (Chiranjeevi) జోడీగా త్రిష ఈ సినిమాలో నటిస్తున్నారని తెలుస్తోంది. చిరంజీవి త్రిష కాంబో మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. మల్లిడి వశిష్ట ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. విశ్వంభర సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus