సుకుమార్, రామ్ చరణ్ కలయికలో తొలిసారి రూపుదిద్దుకున్న సినిమా రంగస్థలం కోసం అభిమానులు టికెట్స్ కొనుక్కొని మరీ వెయిటింగ్ చేస్తున్నారు. చిట్టిబాబుగా చెర్రీని చూసేందుకు తహతహ లాడుతున్నారు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకొని నేడు రిలీజ్ అయింది. అమెరికాలోని 2567 స్క్రీన్లపై ‘రంగస్థలం’ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ మూవీ గురించి ఆసక్తికర న్యూస్ బయటికి వచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ కాపీ చూసిన తర్వాత చిత్ర బృందం భయపడ్డారని తెలిసింది.. కారణం నిడివి .179నిమిషాలు. అంటే ఒక్క నిమిషం తక్కువ మూడు గంటలు.
ఇంత భారీ నిడివిగల సినిమాను చూస్తారా? అని చిత్ర బృందం కత్తెరకు పని చెప్పాలని అనుకున్నారు. ఈ విషయాన్నీ చిరంజీవికి చెబితే ఒప్పుకోలేదంట. ఇందులో ప్రతీ సన్నివేశానికి ప్రాధాన్యం ఉందని, ఎలాంటి కోతలు పెట్టవద్దని అన్నారట. దీంతో సన్నివేశాలకు కత్తెర వేసే ఆలోచనను సుకుమార్ విరమించుకున్నారు. ఇటీవల హిట్ అందుకున్న “అర్జున్రెడ్డి” నిడివి 182 నిమిషాలు. అయినా ప్రేక్షకులు ఆదరించారు. ఈ నేపథ్యంలో ‘రంగస్థలం’ హిట్ సాధించింది ..