Sai Dharam Tej: యాక్సిడెంట్ తరువాత తేజుని చూశారా..?
- November 5, 2021 / 10:46 PM ISTByFilmy Focus
మెగాహీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. నెల రోజులకు పైగా ఆయన హాస్పిటల్ లోనే ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆయన కోమాలోకి ఉన్న వెళ్లారని అంటారు. రీసెంట్ గానే ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కానీ ఇప్పటివరకు ఆయనకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. ఇలాంటి నేపథ్యంలో మెగాస్టార్ ఇంట్లో జరిగిన మెగా వేడుకకు సాయి ధరమ్ తేజ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా తీసిన ఫోటోను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో వేదికగా పంచుకున్నారు. ”అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడు. మా కుటుంబ సభ్యులందరికి ఇది నిజమైన పండుగ..” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇది చూసిన సాయి ధరమ్ తేజ్ ”నా పునర్జన్మకి కారణమైన మీ ప్రేమకి మీ ప్రార్ధనలకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను. మీ ప్రేమ పొందడం నా పూర్వజన్మ సుకృతం” అంటూ రాసుకొచ్చారు.

ఇక ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అయ్యారు. యాక్సిడెంట్ తరువాత సాయి ధరమ్ తేజ్ ఫోటో చూడడం ఇదే తొలిసారి. కొద్దిగా గడ్డంతో, కళ్లజోడుతో, స్లిమ్ గా కనిపించారు తేజు. మిగిలిన మెగా హీరోలు అందరూ కూడా ఈ పిక్ లో వున్నారు. జనవరి నుంచి సాయి ధరమ్ తేజ్ రెగ్యులర్ షూటింగ్ కి హాజరవుతారని తెలుస్తోంది.
అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తి గా కోలుకున్నాడు. మా కుటుంబసభ్యులందరికి ఇది నిజమైన పండుగ. @IamSaiDharamTej pic.twitter.com/DZOepq88ON
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 5, 2021
వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!
















