Chiranjeevi: అయోధ్య రామ మందిర ఆహ్వానం అందింది!

  • January 8, 2024 / 07:55 PM IST

అయోధ్యలో రామ మందిర పునఃప్రతిష్ఠాపనకు ముహూర్తం సమీపిస్తోంది. ఈనెల 22న మధ్యాహ్నం సరిగ్గా 12.20 గంటలకు శాస్త్రోక్తంగా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అదేవిధంగా భారత దేశంలోని ఎంతోమంది సినీ రాజకీయ వ్యాపార క్రీడా రంగానికి చెందినటువంటి ప్రముఖులకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానాలు కూడా అందుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం అందిందని తెలుస్తుంది.

అయితే ఈ విషయం గురించి చిరంజీవి మాట్లాడుతూ తమకు రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం అందిందని జనవరి 22వ తేదీ జరగబోయే ఈ మహత్తర కార్యక్రమానికి కుటుంబ సమేతంగా వెళుతున్నామని చిరంజీవికి వెల్లడించారు. రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఆహ్వానం రావడం నిజంగా అదృష్టం అంటూ ఈ సందర్భంగా చిరంజీవి తెలియజేశారు. ఆ రోజు కుటుంబంతో సహా అయోధ్య వెళ్తున్నామని తెలిపారు.

చిరంజీవి (Chiranjeevi) తాజాగా హనుమాన్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే ఈ కార్యక్రమంలో భాగంగా అయోధ్య ఆహ్వానం గురించి చిరంజీవి వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే అంబానీ రతన్ టాటా బాలీవుడ్ సెలబ్రిటీలో అయినటువంటి రణబీర్ కపూర్ అలియా భట్ రాజ్ హిరానీ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, కన్నడ సూపర్‌ స్టార్ యశ్, సన్నీడియోల్ వంటి వారందరికీ కూడా ఈ ఆహ్వానం అందిందని తెలుస్తుంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus