ఆ సినిమాకు సీక్వెల్‌ రెడీ చేస్తున్నారా? ఇద్దరికీ చాలా అవసరం మరి!

  • February 26, 2024 / 11:39 AM IST

వరుస సినిమాలు చేస్తున్నా.. సరైన విజయం లేనప్పుడు వచ్చే సినిమా ఆ హీరోకు, అతని అభిమానులకు కలకాలం గుర్తుండిపోతుంది అని చెప్పొచ్చు. అలా సాయిధరమ్‌ తేజ్‌కు అచ్చంగా ఇలాంటి సినిమా ఏదైనా ఉందా అంటే అది కచ్చితంగా ‘చిత్రలహరి’ అని చెప్పొచ్చు. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అదిరిపోయే విజయం అందుకుంది. సాయితేజ్‌కు సరైన విజయం ఇచ్చి… బూస్టింగ్‌ ఇచ్చింది. ఇప్పుడు ఆ సినిమా కాంబినేషన్‌పైనే మళ్లీ సాయితేజ్‌ దృష్టి పెట్టారా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది.

మెగా ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చినా తనకంటూ సొంతంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫ్యామిలీ హీరో అంటూ మొదట్లో తనపై వచ్చిన విమర్శల్ని తట్టుకుని నిలబడి తనేంటో చూపించాడు. సరిగ్గా ఈ సమయంలో యాక్సిడెంట్ అవ్వడంతో సినిమాలు దూరమయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో ఆకట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత అనౌన్స్‌ చేసిన సినిమాల విషయంలో ఏదో ఇబ్బంది అవుతోంది అంటున్నారు. వివిధ కారణాల వల్ల ఆ సినిమాల ఆలస్యమవుతున్నాయి అంటున్నారు.

ఈ నేపథ్యంలో సాయితేజ్‌ కొత్త సినిమా ఏంటి అనే చర్చ మొదలైంది. ఆ సినిమాల సంగతి తర్వాత చూద్దాం ముందు కొత్త సినిమా అనౌన్స్‌ చేసేద్దాం అని అనుకుంటున్నట్లు భోగట్టా. ఈ క్రమంలో కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది అని వార్తలొస్తున్నాయి. అది కొత్త కథతో కాకుండా… గతంలో ఇద్దరూ కలసి చేసిన ‘చిత్రలహరి’ సినిమాకు సీక్వెల్‌గా ఉండొచ్చు అని చెబుతున్నారు. 2019లో రిలీజైన ‘చిత్రలహరి’ సినిమా రూ.25 కోట్లకుపైగా వసూలు చేసింది అని అంటున్నారు.

తొలి ‘చిత్రలహరి’ని (Chitralahari 2) నిర్మించిన మైత్రీ మూవీ మేకర్సే ఈ సినిమాను కూడా నిర్మిస్తారని టాక్‌. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తయ్యాక ఈ సినిమాను అనౌన్స్‌ చేస్తారు అని చెబుతున్నారు. సాయితేజ్‌ చేతిలో ప్రస్తుతం సంపత్‌ నంది ‘గాంజా శంకర్‌’ సినిమాతోపాటు మరో సినిమా చేస్తున్నాడు.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus