సుడిగాలి సుధీర్ పై జనాలు ఫైర్!

  • December 29, 2020 / 05:12 PM IST

‘జబర్దస్త్’ షోతో కమెడియన్ గా మంచి పాపులారిటీ దక్కించుకున్న సుడిగాలి సుధీర్.. బుల్లితెరపై బాగా బిజీ అయిపోయాడు. పలు షోలకు యాంకరింగ్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. హీరోగా కూడా అవకాశాలు వస్తుండడంతో సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఇప్పటికే ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు సుధీర్. ఇప్పుడు అదే సినిమాను డైరెక్ట్ చేసిన రాజశేఖర్ రెడ్డి పులిచర్ల.. సుధీర్ ని హీరోగా పెట్టి మరో సినిమా తీస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.

ప్రస్తుతం హైదరాబాద్ లో సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పుడు ఈ షూటింగ్ ని జనాలు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. కరోనా సమయంలో షూటింగ్ ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన నగరంలోని మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బీ బ్లాక్ కాలనీలో చోటు చేసుకుంది. షూటింగ్ మొదలైన కాసేపటికే స్థానికులు అక్కడకి చేరుకొని.. కరోనా విజృంభన సమయంలో నివాసాల మధ్య షూటింగ్ లు నిర్వహించడం ఏంటని మండిపడ్డారు.

దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. షూటింగ్ కావాల్సిన అన్ని అనుమతులు తీసుకొనే చిత్రీకరణ జరుపుతున్నారని పోలీసులు చెప్పడంతో స్థానికులు అక్కడ నుండి వెళ్లిపోయారట.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus