Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’
- March 3, 2026 / 12:01 PM ISTByPhani Kumar
ఇప్పుడు ఎలాంటి సినిమా అయినా 4,5 వారాల్లో ఓటీటీకి వచ్చేస్తుంది. సినిమా బాగుంటే థియేటర్లో చూస్తున్నారు ప్రేక్షకులు. బాగోలేదు అనే టాక్ వస్తే ఓటీటీలో చూద్దామని డిసైడ్ అయిపోయి ధియేటర్ కి రావడం లేదు.
Bhartha Mahasayulaku Wignyapthi
ఒకవేళ ఓటీటీకి కూడా సినిమా త్వరగా రాకపోతే.. ఆడియన్స్ ఆ సినిమాని మర్చిపోతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అసలు విషయానికి వెళితే.. ఈ సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి.

అవే ‘ది రాజాసాబ్’ ‘మన శంకర వరప్రసాద్ గారు’ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bhartha Mahasayulaku Wignyapthi) ‘అనగనగా ఒక రాజు’ ‘నారీ నారీ నడుమ మురారి’..! వీటిలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ తప్ప మిగిలిన అన్ని సినిమాలు 5 వారాల్లో ఓటీటీకి వచ్చేశాయి. సంక్రాంతి విన్నర్ గా నిలిచిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సైతం 5 వారాల్లో ఓటీటీకి వచ్చేసింది.
మరి రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఎందుకు ఇంకా ఓటీటీకి రాలేదు? అనే మీమాంసలో రవితేజ అభిమానులు ఉన్నారు. వాళ్ళు తప్ప ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఎక్కువమంది వెయిట్ చేయడం లేదు. చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమా ఒకటుంది అనే విషయాన్ని కూడా మర్చిపోయారు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఎందుకు ఈ సినిమా ఓటీటీకి ఇంకా రాలేదు? అంటే… నిజానికి ఫిబ్రవరిలోనే ఈ సినిమా ఓటీటీకి రావాల్సి ఉంది.
కానీ కొన్ని సాంకేతిక కారణాలు మరియు డబ్బింగ్ పనుల వల్ల వాయిదా పడినట్టు ఇన్సైడ్ టాక్.ధియేటర్లలో ఈ సినిమా పెద్దగా ఆడలేదు.మిక్స్డ్ టాక్ రావడంతో.. మిగిలిన సంక్రాంతి సినిమాల వల్ల ధియేటర్లు ఎక్కువ మిగల్లేడదు. కానీ రవితేజ, సునీల్, వెన్నెల కిషోర్..ల కామెడీ, ఆషిక రంగనాథ్ గ్లామర్ ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. చూద్దాం.. ఓటీటీలో అయినా దీనికి అప్రీసియేషన్ వస్తుందేమో.













