హరికృష్ణ మాటలతో నందమూరి వంశస్థుల ఫోటోలు.. వైరల్ అవుతున్న వీడియో..!

  • February 21, 2023 / 07:58 PM IST

నందమూరి తారకరత్న మరణంతో నందమూరి – నారా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.. 23 రోజుల పాటు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారక రత్న.. ఫిబ్రవరి 18న శివరాత్రి రోజు కన్నుమూశారు.. తారక రత్న – అలేఖ్య రెడ్డి దంపతులకు ముగ్గురు పిల్లలు.. మొదట కుమార్తె, తర్వాత కవలలు (పాప – బాబు) పుట్టారు.. తాత ఎన్టీ రామారావు పేరు వచ్చేలా ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టుకుని తాత గారి మీద ప్రేమను చాటకున్నారు తారక రత్న..

పెద్ద పాప పేరు నిషిక (N), తనయుడు తనయ్ రామ్ (T), రెండో పాప పేరు రేయా (R).. ఇలా NTR అనే అర్థం వచ్చేలా తమ చిన్నారులకు పేర్లు పెట్టుకున్నారు.. అయితే నందమూరి తారక రామారావు, తనయుడు హరికృష్ణ, ఆయన కుమారుడు జానకి రామ్, తారక రత్న ఫోటోలతో.. ‘‘బ్రతికేది నాలుగు రోజులైనా.. నలభై తరాలు చెప్పుకునే విధంగా బ్రతకాలంటారు పెద్దలు..

ఎవరైనా ఎదుటివారు మనల్ని చేయి చాచి యాచించినప్పుడు మన చెయ్యి పైనుండాలే తప్ప కిందుండకూడదు.. పైన బ్రహ్మదేవుడు ఆదేశించాడు.. శెలవు’’ అంటూ హరికృష్ణ చెప్పిన డైలాగ్స్ బ్యాగ్రౌండ్‌తో రూపొందించిన వీడియో అభిమానుల చేత కంటతడి పెట్టిస్తుంది..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus