మహేష్ 25 వ చిత్రంలో హీరోయిన్ గా ఆమె
- June 16, 2017 / 07:48 AM ISTByFilmy Focus
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్లో ‘స్పైడర్’ సినిమాని కంప్లీట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ రేపటితో పూర్తి అవుతుంది. ఆదివారం రెస్ట్ తీసుకొని సోమవారం మహేష్ నెక్ట్ సినిమా షూటింగ్ లోకి అడుగుపెట్టనున్నారు. భరత్ అను నేను అనే టైటిల్ ఫిక్స్ చేసిన ఈ మూవీ అతని కెరీర్లో 24 వది. దీని తర్వాతి సినిమాని కూడా ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వంశీ పైడిపల్లితో తన 25వ సినిమాను చేయనున్నారు. దీనిని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్విని దత్ లు సంయుక్తంగా నిర్మించనున్నారు. మహేష్ కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీ కానున్న ఈ ప్రాజక్ట్ కి ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఆర్టిస్టుల, టెక్నీషియన్ల సెలక్షన్ చేస్తున్నారు.
హీరోయిన్ గా పూజ హెగ్డేను పరిశీలిస్తున్నారు. ఒక లైలాకోసం చిత్రంతో తెలుగులో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ముకుందతో మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా అల్లు అర్జున్ సరసన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. అందాలతో ఆకట్టుకుంటోంది. ఆమె మహేష్ పక్కన చక్కగా సూట్ అవుతుందని చిత్ర బృందం నమ్ముతోంది. త్వరలో ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















