భరత్ అనే నేను కోసం అసెంబ్లీ సెట్
- August 28, 2017 / 02:11 PM ISTByFilmy Focus
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రొమేనియా(యూరప్)లో ఉన్నారు. ఆయనతో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది. వీరిద్దరిపై ఓ రొమాంటిక్ డ్యూయెట్ ని మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న స్పైడర్ ఈ పాటతో ప్రొడక్షన్ కంప్లీట్ అవుతుంది. ఈ షూటింగ్ పూర్తికాగానే మహేష్ భరత్ అనే నేను షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఇప్పటికే బాల మహేష్ తో ఒక షెడ్యూల్, మహేష్, కైరా అద్వానీపై మరో షెడ్యూల్ ని డైరక్టర్ కొరటాల శివ విజయవంతంగా పూర్తి చేశారు. మూడో షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది.
ఇందుకోసం రెండు కోట్లతో భారీ అసెంబ్లీ సెట్ ని నిర్మించినట్లు సమాచారం. ఇక్కడ కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్న ఈ సినిమాలో కృష్ణ కూడా ప్రత్యేక పాత్ర పోషించనున్నట్లు తెలిసింది. భారీ బడ్జెట్ తో డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి బరిలోకి దిగనుంది. మహేష్, కొరటాల కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు ఘనవిజయం సాధించటంతో భరత్ అనే నేను పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















