భారీ ధరకు అమ్మడుపోయిన “జై లవకుశ” శాటిలైట్ రైట్స్
- April 24, 2017 / 01:54 PM ISTByFilmy Focus
బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న “జై లవ కుశ” సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. హ్యాట్రిక్ విజయాల తర్వాత తారక్ చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో తొలి సారి ఎన్టీఆర్ నటిస్తుండడం, హాలీవుడ్, బాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తుండడంతో దీని థియేటర్ రైట్స్ కొనడానికి షూటింగ్ మొదలు పెట్టిన రోజే నిర్మాత కళ్యాణ్ రామ్ కి భారీ ఆఫర్ వచ్చింది. అయితే దానిని సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడు శాటిలైట్ రైట్స్ కోసం ఛానల్స్ పోటీ పడ్డాయి. గత చిత్రం జనతా గ్యారేజ్ ని మాటీవీ వారు 12 .5 కోట్లకు సొంతం చేసారు.
జై లవకుశ శాటిలైట్ హక్కులను భారీ మొత్తం చెల్లించి జెమినీ టీవీ వారు కైవశం చేసుకున్నారు. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో విశ్వరూపం చూపించనున్న చిత్రం కోసం 14 కోట్లను ఇచ్చారని తెలిసింది. దీంతో ఈ వార్త ఫిలిం నగర్లో హాట్ టాపిక్ అయింది. 55 కోట్లతో నిర్మితమవుతున్న ఈ మూవీ టీజర్ కూడా రాకముందే శాటిలైట్ హక్కులు 14 కోట్లకు అమ్ముడు పోవడం ఎన్టీఆర్ సత్తాని చాటుతోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















