Hyper Aadi, Balayya Babu: ఫక్తు నందమూరి అభిమాని కూడా ఇలా మాట్లాడలేడేమో.. వామ్మో ఏంటా ఫ్లో!
- May 29, 2024 / 08:28 PM ISTByFilmy Focus
హైపర్ ఆది (Hyper Aadi) .. తెలుగు టీవీ కామెడీ షోలు, రియాలిటీ షోలు చూసినవాళ్లకు ఈ పేరు గురించి, ఆయన మాటల ప్రవాహం గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మెగా ఫ్యామిలీ గురించి, ముఖ్యంగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గురించి ఆది మాట్లాడుతూనే ఉంటాడు, అవి విని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. అలాంటి ఆది నోటి నుండి తొలిసారిగా వేరే హీరో పెద్ద గురించి మాటలు వినిపించాయి. అవి ఎంతలా బాగున్నాయి అంటే ఫక్త నందమూరి అభిమాని కూడా ఇలా మాట్లాడలేడేమో అనిపించేతలా ఉన్నాయి.
విశ్వక్సేన్ (Vishwak Sen) – కృష్ణ చైతన్య (Krishna Chaitanya) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) . నేహా శెట్టి (Neha Shetty), అంజలి (Anjali) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మే 31 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ (Nandamuri Balakrishna) ముఖ్య అతిథిగా హాజరవ్వగా.. ఆయన్ను ఉద్దేశిస్తూ ఆది అద్భుతంగా మాట్లాడాడు. ఇప్పుడు ఆ మాటలే వైరల్గా మారాయి.

బాలయ్య.. ఒక జనరేషన్ వాళ్లకు ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’లాంటి చిత్రాలు ఇచ్చారు. మరో జనరేషన్ వాళ్లకు ‘సమరసింహా రెడ్డి’ (Samarasimha Reddy) , ‘నరసింహా రెడ్డి’ (Narasimha Naidu) లాంటి చిత్రాలు అందించాడు. ఇంకో జనరేషన్ వాళ్లకు ‘సింహా’ (Simha) ఇచ్చాడు. మామూలుగా జనరేషన్ మారితే మనుషులు మారతారు, టెక్నాలజీ మారుతుంది, కానీ, బాలయ్య బాబు ఎనర్జీ మారదు అంటూ అదరగొట్టేశాడు ఆది. దీంతో బాలయ్య గురించి అంత ఈజీగా, అంత ఆసువుగా చెప్పడం ఆదికే చెల్లింది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

పవన్ కల్యాణ్ గురించి ఆది ఇలా మాట్లాడటం అందరికీ తెలుసు. ఇప్పుడు బాలయ్య గురించి మాట్లాడటం ఆసక్తికరం. ఆఖరిగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ గురించి చెబుతూ.. నందమూరి నటసింహం బాలకృష్ణ, కొణిదెల కొదమసింహం పవన్ కల్యాణ్ కలసి అసెంబ్లీలో అడుగుపెడితే ఎలా ఉంటుందో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అలా ఉంటుంది అని హైప్ ఇచ్చాడు. చూడాలి మరి వాయిదాల మీద వాయిదాల తర్వాత వస్తున్న సినిమా ఎలా ఉంటుందో?
















