వెంకటేష్ తో కలిసి నటించాలంటే చాలా భయమన్న రానా
- August 9, 2017 / 12:30 PM ISTByFilmy Focus
బాహుబలి కంక్లూజన్ తర్వాత దగ్గుబాటి రానా హీరోగా నటిస్తున్న సినిమా నేనే రాజు నేనే మంత్రి. తేజ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రచారం జోరుగా చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు హీరోయిన్ కాజల్ అగర్వాల్ తో కలిసి విజయవాడలోని ట్రెండ్సెట్ మాల్ కి వెళ్లారు. అక్కడ రానా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పారు. బాబాయ్ వెంకటేష్ తో కలిసి నటించాలనే ఎప్పటి నుంచో కోరిక ఉందని, కానీ భయం వల్ల సినిమా చేయలేక పోయానని వివరించారు. ఇప్పుడు ఆ భయం తగ్గిందని మంచి కథ వస్తే కలిసి నటించడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు.
‘నేనే రాజు నేనే మంత్రి’ గురించి మాట్లాడుతూ ఇది రాధా జోగేంద్రల ప్రణయ కథా చిత్రమని.. ఇందులో రాజకీయాలు మిళితయమై ఉంటాయని వెల్లడించారు. సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అశితోష్ రాణా, కేథరిన్ థెరిస్సా, నవదీప్, పోసాని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా మాస్ చిత్రంగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















