జై లవకుశ సెన్సార్ కాపీ సిద్ధం!
- September 12, 2017 / 01:50 PM ISTByFilmy Focus
బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ సినిమా షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేశారు. మిగిలిఉన్న ఒక పాట షూటింగ్ ని ఎన్టీఆర్ వేగంగా పూర్తి చేశారు. ఈ పాటను కూడా ఎడిటింగ్ పూర్తిచేసుకున్న కాపీకి కలపడం కూడా జరిగిపోయింది. దీంతో చిత్ర నిడివి 155 నిముషాలు అయినట్లు తెలిసింది. రెండున్నర గంటల కంటే ఐదు నిముషాలు ఎక్కువగానే సినిమా ఉందన్నమాట. మూడు పాత్రలు కావడం, అందులోను కథాబలమున్న సినిమా కావడంతో ఇంకా తగ్గించడానికి కుదరలేదని సమాచారం. ఎల్లుండి (సెప్టెంబర్ 14 ) ఈ మూవీ సెన్సార్ సభ్యుల ముందుకు వెళ్లనున్నట్లు తెలిసింది.
మూడు టీజర్లు, పాటలు, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఎన్టీఆర్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 21 న థియేటర్లోకి రానుంది. మూడు క్యారెక్టర్లలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూసేందుకు అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















