ఎన్టీఆర్ 27వ సినిమా కోసం ఆసక్తికర టైటిల్ రిజిస్టర్ చేసిన కళ్యాణ్ రామ్
January 7, 2017 / 07:16 AM IST
|Follow Us
జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న చిత్రానికి సంభందించిన పనులు చకచకా సాగుతున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో తొలిసారి తారక్ నటిస్తున్న ఈ ఫిల్మ్ కి టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలిసింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్ 27వ చిత్రానికి ‘జై లవకుశ’ అనే పేరుని నిర్మాత కళ్యాణ్ రామ్ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు.ఈ చిత్రంలో తారక్ మూడు పాత్రల్లో మెప్పించనున్నారు. అందుకే మొదట “త్రిమూర్తులు” అనే టైటిల్ ని పరిశీలించారు. ఆ తర్వాత “నట విశ్వరూప” అనే పేరు అనుకున్నారు. ఈ రెండు పేర్లు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కి నచ్చలేదు. దీంతో బాబీ కొత్తగా జై లవకుశ అనే పేరుని సూచించారు.
ఇది అన్నదమ్ములకు నచ్చింది. దీంతో వెంటనే కళ్యాణ్ రామ్ రిజిస్టర్ చేయించారు. జనవరి 26 నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, అనుపమ పరమేశ్వరన్, మంజిమ మోహన్ లు కథానాయికలుగా నటిస్తుండగా, కీలక పాత్రలో శ్రీదేవి కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తాయి. ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వివరాలను చిత్రం ప్రారంభం రోజు నిర్మాత కళ్యాణ్ రామ్ వెల్లడిస్తారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.