Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…
- August 11, 2026 / 12:14 PM ISTByFilmy Focus Desk
కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) సినిమాల్లోకి వచ్చి తొమ్మిదేళ్లు అయిపోయింది. ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఆమె చాలా సినిమాల్లోనే నటించింది. అయితే అందులో గుర్తుండిపోయే, గుర్తుకు తెచ్చుకోదగ్గ సినిమాలు చాలా తక్కువ. ఇప్పుడు ఇన్నాళ్లకు తొలిసారి హీరోయిన్గా ఓ సినిమా చేసింది. అదే ‘అగధ’. ఎం.ఎస్.రాజు తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రెస్మీట్ పెట్టింది. ఈ క్రమంలో వేదికపై కామాక్షి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Kamakshi Bhaskarla
‘‘నేను విదేశాల నుండి ఇండియాకు వచ్చి తొమ్మిదేళ్లు అవుతోంది. ఇన్నాళ్లకు నా భుజం మీద మోయదగ్గర సినిమా చేశాను. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావడమే చాలా తక్కువ. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి’’ అంటూ తన పరిస్థితి, ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల పరిస్థితి గురించి మాట్లాడింది. తాను ఇన్నేళ్లు చేసిన పాత్రలు చూసి.. ఏముంది ఇలాంటి పాత్రలే చేస్తుంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ నా పాత్రల వెనుక నేను పడ్డ కష్టం గురించి వారికి తెలియదు కదా.. అంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది.

నేను వైద్య వృత్తిని వదులుకొని సినిమాలవైపు వచ్చినప్పుడు నా గురించి తెలిసినవాళ్లు, తెలియనివాళ్లు చాలా రకాలుగా మాట్లాడేవారు. అవన్నీ నా వరకు రాకుండా నా ఫ్యామిలీ చూసుకుంది అంటూ తన కుటుంబం గురించి చెప్పుకొచ్చింది కామాక్షి (Kamakshi Bhaskarla). ఈ క్రమంలో ఆమో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకుంది. అలాగే జలుబు, జ్వరం ఉన్నా.. ఈ ఈవెంట్కి వచ్చానని చెప్పిన తన డెడికేషన్ గురించి చెప్పకనే చెప్పింది కామాక్షి.

స్పీచ్ ప్రారంభించడానికి ముందు యాంకర్ సుమను కాస్త దూరంగా ఉండమని కామాక్షి (Kamakshi Bhaskarla) చెప్పింది. దాని గురించి క్లారిటీ ఇస్తూ.. తనకు జ్వరం ఉండటం వల్లనే ఆలా దూరంగా ఉండమని చెప్పానని.. ఇంకేమీ లేదని క్లారిటీ ఇచ్చింది.
ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?











