Kamal Haasan: నా మాట ఎవరూ నమ్మలేదు.. ఇప్పుడు నాకు నచ్చింది తింటాను: కమల్ హాసన్

  • June 15, 2022 / 06:17 PM IST

‘విశ్వరూపం 2’ తర్వాత కమల్ హాసన్ నుండి వచ్చిన చిత్రం ‘విక్రమ్’. దాదాపు 4 ఏళ్ళ తర్వాత కమల్ నుండి వచ్చిన సినిమా ఇది. లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కమల్‌తో పాటు విజయ్‌సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌, సూర్య వంటి స్టార్ హీరోలు కూడా ఈ మూవీలో నటించి మెప్పించారు. కమల్ హాసన్ కు ఇది మంచి కమ్‌బ్యాక్‌ ఇచ్చిన మూవీ.

ఈ చిత్రం విడుదలైన 12 రోజుల్లోనే రూ. 300 కోట్ల వసూళ్లను రాబట్టింది ఈ మూవీ. తాజాగా చెన్నైలో రక్తదాన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కమల్ హాసన్ అనంతరం తన విక్రమ్ మూవీ గురించి దాని బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కమల్ హాసన్ మాట్లాడుతూ.. “అందరూ అభివృద్ధి చెందాలంటే డబ్బు గురించి చింతించని నాయకుడు మనకు అవసరం. గతంలో నేను చెప్పాను. రూ. 300 కోట్లు సంపాదించగలను అని.!

కానీ అప్పుడు నా మాట ఎవ్వరూ నా మాట నమ్మలేదు. కనీసం వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ‘విక్రమ్‌’ బాక్సాఫీస్‌ కలెక్షన్స్ తో నా మాట నిజమైంది. నాకు ఉన్న అప్పులన్నీ ఇప్పుడు తీర్చేస్తా. నాకు నచ్చిన ఆహారాన్ని తింటా. నా కుటుంబం, సన్నిహితులకు చేతనైన సాయం చేస్తా.

ఒకవేళ నా దగ్గర డబ్బు అయిపోతే ఇవ్వడానికి ఏం లేదని చెప్పేస్తా. వేరే వాళ్ల దగ్గర డబ్బు తీసుకుని పక్క వాళ్లకి సాయం చేయాలని నాకు ఉండదు. నాకు గొప్ప పేరు వద్దు. ఒక మంచి మనిషిగా ఉండాలనుకుంటున్నాను అంతే’ అంటూ తన మనసులో ఉన్న భావాన్ని బయటపెట్టారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus