Keerthy Suresh, Mahesh Babu: సూపర్ స్టార్ పై కీర్తి సురేష్ కు ఇంత కోపమా?

  • May 3, 2022 / 10:39 PM IST

నేను శైలజ, నేను లోకల్, మహానటి సినిమాల ద్వారా ప్రేక్షకుల్లో నటిగా కీర్తి సురేష్ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ నటించిన సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అయితే సర్కారు వారి పాట సినిమాతో కీర్తి సురేష్ కు చాలా సంవత్సరాల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ దక్కుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సర్కారు వారి పాట ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి సురేష్ ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

సూపర్ స్టార్ మహేష్ బాబును తాను మూడుసార్లు కొట్టానని ఆమె చెప్పుకొచ్చారు. మహేష్ తో షూట్ అంటే సరదాగా ఉంటుందని కీర్తి తెలిపారు. సినిమాలో ఒక పాట షూటింగ్ సమయంలో తాను స్టెప్పులు మరిచిపోయానని టైమింగ్ మిస్ అయ్యానని ఆమె అన్నారు. టైమింగ్ మిస్ కావడం వల్ల రెండుసార్లు రాంగ్ టైమింగ్ లో మహేష్ బాబును కొట్టానని కీర్తి సురేష్ వెల్లడించారు. అయితే తాను మహేష్ ను క్షమాపణలు కోరానని ఆమె తెలిపారు.

ఆ తర్వాత కూడా మరోసారి తాను మిస్ టైమింగ్ తో మహేష్ ను కొట్టానని ఆమె చెప్పుకొచ్చారు. మూడుసార్లు ఆ విధంగా కొట్టడంతో నాపై ఏమైనా కోపమా? అని మహేష్ బాబు తనను అడిగారని ఆమె వెల్లడించారు. మహేష్, కీర్తి సురేష్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా మే 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. రికార్డు స్థాయి స్క్రీన్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నారని సమాచారం అందుతోంది.

సర్కారు వారి పాట ట్రైలర్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. కీర్తి సురేష్ ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా తర్వాత స్టార్ హీరోలకు జోడీగా కీర్తి సురేష్ కు మరిన్ని ఆఫర్లు పెరుగుతాయని అభిమానులు భావిస్తున్నారు. ట్రైలర్ లో కథ ఎక్కువగా లీక్ కాకుండా పరశురామ్ జాగ్రత్త పడ్డారు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus