వామ్మో ఒక్కో సినిమాకి కీర్తి అంత తీసుకుంటుందా?

  • July 1, 2020 / 12:37 PM IST

‘నేను శైలజ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి సురేష్.. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. తరువాత నానితో ‘నేను లోకల్’ సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది. దాంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల ‘అజ్ఞాతవాసి’ లో నటించే అవకాశం కొట్టేసింది ఈ బ్యూటీ. అయితే ఆ సినిమా అంతగా ఆడకపోయినా.. పవన్ సినిమా కాబట్టి కీర్తికి మరింత ఫాలోయింగ్ ఏర్పడిందనే చెప్పాలి. ఈ క్రమంలో వచ్చిన ‘మహానటి’ చిత్రం ఈమెను స్టార్ హీరోయిన్ గా చేసేసింది.

సావిత్రిగారి జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ నటన అద్భుతమనే చెప్పాలి. ఈ చిత్రంతో ఏకంగా నేషనల్ అవార్డునే కైవసం చేసుకుంది కీర్తి సురేష్. ఇక ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్ చేతిలో అరడజను పైనే ఆఫర్లు ఉన్నాయి. ఇక ఈమె ప్రస్తుతం అందుకుంటున్న పారితోషికం వింటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. అందుతున్న సమాచారం ప్రకారం కీర్తి.. ఒక్కో సినిమాకి 2 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటుందట.

అంతేకాదు లాభాల్లో వాటా కూడా అందుకుంటుందట. ప్రస్తుతం ‘మిస్ ఇండియా’ ‘అన్నాతై’ వంటి చిత్రాల్లో నటిస్తుంది కీర్తి సురేష్. అంతేకాదు మహేష్ బాబు – పరశురామ్(బుజ్జి) కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈమె నటించిన ‘పెంగ్విన్’ చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సంగతి తెలిసిందే.

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus