Nayanthara: డాక్యుమెంటరీ ఎఫెక్ట్‌: నయన్‌ ₹5 కోట్లు కట్టాల్సిందేనా?

నయనతార – నెట్‌ఫ్లిక్స్‌ కలసి ప్రేక్షకులకు అందించిన డాక్యుమెంటరీ ‘బియాండ్‌ ది డ్రీమ్స్‌’. ప్రేక్షకులకు ఆ డ్రీమ్స్‌ ఎలా అనిపించాయో తెలియదు కానీ, ఆమెకు మాత్రం కలలోకి ఆ డాక్యుమెంటరీ వస్తూనే ఉంది. గతంలో ధనుష్‌ నుండి లీగల్‌ నోటీసులు అందుకున్న నయనతార.. ఇప్పుడు ‘చంద్రముఖి’ టీమ్‌ నుండి ఈ పరిస్థితి ఎదురైంది. ఆ డాక్యుమెంటరీలోని ‘చంద్రముఖి’ సన్నివేశాలు తొలగించాలని దాఖలైన పిటిషన్‌పై జవాబు ఇవ్వాలని డాక్యుమెంటరీ నిర్మాణ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్‌కు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

Nayanthara

నటి నయనతార, డైరక్టర్‌ విఘ్నేశ్‌ శివన్‌ వివాహ వేడుకలు, వారికి సంబంధించిన వీడియో రికార్డులను డార్క్‌ స్టూడియో ఓ డాక్యుమెంటరీగా రూపొందించిన విషయం తెలిసిందే. ఆ డాక్యుమెంటరీ చాలా ఏళ్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు 2024లో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అయింది. అందులోనే ‘చంద్రముఖి’ సినిమా సన్నివేశాలు ఉన్నాయి అనేది ఏబీ ఇంటర్నేషనల్స్‌ వాదన. ఈ మేరకు మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేసింది. రూ.5 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని కూడా కోరింది.

ఈ కేసును సోమవారం విచారించిన మద్రాసు హైకోర్టు రెండు వారాల్లో జవాబివ్వాలని డాక్యుమెంటరీ నిర్మాణ సంస్థ డార్క్‌ స్టూడియో, నెట్‌ఫ్లిక్స్‌కు ఉత్తర్వులు ఇచ్చింది. మరి ఈ విషయంలో ఆ రెండు సంస్థలు ఎలాంటి సమాధానం ఇస్తాయో చూడాలి. ఈ విషయంలో నయనతార రియాక్షన్‌ కూడా కీలకంగా మారనుంది. ఎందుకంటే గతంలో నటుడు ధనుష్‌తో ఇలాంటి వివాదమే నెలకొంది. ధనుష్‌కి చెందిన వండర్‌బార్‌ ఫిలిమ్స్‌ నిర్మించిన ‘నానుమ్‌ రౌడీదాన్‌’ షూటింగ్‌ సన్నివేశాలను డాక్యుమెంఒటరీ వాడినందుకు ఆయన కోర్టు మెట్లెక్కారు. ఆ ఈ కేసు ఇంకా విచారణలో ఉంది.

ఈ నేపథ్యంలో ‘చంద్రముఖి’ సినిమా టీమ్‌ ఇలా నోటీసులు పంపడం గమనార్హం. గతంలో ధనుష మీద అంతెత్తున ఎగిరిన నయన్‌.. ఇప్పుడడు ‘చంద్రముఖి’ టీమ్‌ మీద ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి. ఈ విషయంలో ఆమె తప్పని తేలితే రూ.5 కోట్లు చెల్లించాల్సిందే. అయితే అదెవరు చెల్లిస్తారు అనేది ఇక్కడ ఆసక్తికరం.

‘మిస్టర్ పర్ఫెక్ట్’ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సాగర్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus