నార్నె నితిన్ (Narne Nithin) ఎన్టీఆర్ (Jr NTR) బావమరిదిగా సినీ రంగప్రవేశం చేశాడు. ‘మ్యాడ్’ (MAD) ‘ఆయ్’ (AAY) ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) వంటి సినిమాలు హిట్ అయ్యాయి. హీరోగా నితిన్ కి మంచి గుర్తింపు వచ్చింది. కానీ అతని మొదటి సినిమా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ (Sri Sri Sri Raja Vaaru). సతీష్ వేగేశ్న(Satish Vegesna) డైరెక్ట్ చేసిన ఈ సినిమా దాదాపు 3 ఏళ్ళుగా రిలీజ్ కోసం స్ట్రగుల్ అవుతూ.. మొత్తానికి నిన్న అంటే జూన్ 6న బయటకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయినట్టు చాలా మందికి తెలీదు.
ఎందుకంటే హీరో నార్నె నితిన్ కనీసం.. ఈ సినిమాను ప్రమోట్ చేయలేదు.. కనీసం సోషల్ మీడియాలో ఒక ట్వీట్ లేదా పోస్ట్ వంటివి చేసింది కూడా లేదు. అతను ప్రమోట్ చేయకపోవడం కారణం ఏంటనేది.. సినిమా చూశాక ప్రతి ఒక్కరికీ అర్థం అవుతుంది. కానీ నిర్మాత పెట్టిన డబ్బు, సమయం వంటి వాటికి ఎథికల్ గా వాల్యూ ఇచ్చి.. మినిమమ్ ప్రమోషన్ అయినా చేసుంటే అతనికి హుందాగా ఉండేది. అలాంటిది చేయలేదు.
మరోపక్క అదే ‘మ్యాడ్’ తో నార్నె నితిన్ తో పాటు సంగీత్ శోభన్ (Sangeeth Shobhan) కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘మ్యాడ్’ తో ఇతనికి కూడా డిమాండ్ పెరిగింది. అయితే ఇతను ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘గ్యాంబ్లర్స్’ అనే సినిమా నిన్న అంటే జూన్ 6న రిలీజ్ అయ్యింది. ఇది కూడా రిలీజ్ అయినట్టు చాలా మందికి తెలీదు.
అందుకు కారణం హీరో సంగీత్ శోభన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే.. ఈ సినిమా ప్రమోషన్స్ కి అతను రాలేదు. అలాగే ఈ సినిమాని మినిమమ్ ప్రమోట్ చేసింది లేదు. అతని ఇమేజ్, మార్కెట్ ఎక్కడ దెబ్బ తింటాయో అని భావించి..’గ్యాంబ్లర్స్’ ను గాలికి వదిలేశాడు సంగీత్.