గుజరాత్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న మహేష్, మురుగదాస్ మూవీ
- December 26, 2016 / 02:03 PM ISTByFilmy Focus
గుజరాత్ ముఖ్య పట్టణం అహ్మదాబాద్ లో ఈనెల 5 వ తేదీన ప్రారంభమైన సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ భారీ షెడ్యూల్ పూర్తి అయింది. అక్కడి ఫేమస్ ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను డైరక్టర్ మురుగదాస్ చిత్రీకరించారు. ఈ షూటింగ్లో మహేష్ తో పాటు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, విలన్ ఎస్.జె.సూర్య తదితరులు పాల్గొన్నారు. దాదాపు 20 రోజుల పాటు విరామం లేకుండా శ్రమించారు. దీంతో ప్రిన్స్ వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోనున్నారు.
భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితార తో కలిసి న్యూయార్క్ టూర్ ప్లాన్ చేశారు. 2017 సంవత్సరానికి అక్కడే స్వాగతం చెప్పనున్నారు. టూర్ ముగించుకొని ఇండియాకు వచ్చిన వెంటనే మరో షెడ్యూల్ కి పయనం కానున్నారు. జనవరి 4 నుంచి ముంబై, పూనేలో మరో రెండు షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. టాకీ పార్ట్ పూర్తికాగానే పాటలకు విదేశాలకు పయనం కానున్నారు. వంద కోట్ల బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి “సంభవామి” అనే టైటిల్ అనుకుంటున్నారు. ఫస్ట్ లుక్ ని జనవరి 26 న విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















