దసరాకి స్పైడర్ రిలీజ్ అవుతుందని చెప్పిన మహేష్
- May 29, 2017 / 06:30 AM ISTByFilmy Focus
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు శుభవార్త. మురుగదాస్ డైరక్షన్లో మహేష్ చేస్తున్న స్పైడర్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు అయింది. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా దసరాకి థియేటర్లోకి వస్తుందని మహేష్ స్వయంగా ప్రకటించారు. ట్విట్టర్ వేదికపై ఈ విషయాన్నీ అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు స్పైడర్ టీజర్ మే 31న సాయంత్రం 5 గంటలకు విడుదలవుతుందని పోస్ట్ చేసారు. ఇంటెలిజన్స్ ఆఫీసర్ గా ప్రిన్స్ నటిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్, విలన్ గా ఎస్.జె.సూర్య నటిస్తున్నారు.
ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఒక పాట విదేశాల్లో చిత్రీకరించనుండగా, మరో పాటను హైదరాబాద్ లో తెరకెక్కించనున్నారు. హరీష్ జయరాజ్ అందించిన పాటలు వినాలని అందరూ ఎదురుచూస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















