Mahesh Babu: అనీల్, వంశీలకు ఛాన్స్ దొరకదేమో!

  • September 25, 2021 / 07:13 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సినిమాల గురించి ఓపెన్ గా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ‘సర్కారు వారు పాట’ సినిమా ‘పోకిరి’ని మించి ఉంటుందని.. పూరి శిష్యుడిగా పరశురామ్ అలాంటి సినిమా అందిస్తున్నాడని మహేష్ చెప్పారు. సింగిల్ టేక్ లో కథ ఓకే చేశానని చెప్పారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

దీని తరువాత త్రివిక్రమ్ సినిమా.. ఆ తరువాత రాజమౌళితో సినిమా చేయబోతున్న విషయాన్ని వెల్లడించారు. అంటే గతంలో వినిపించిన అనిల్ రావిపూడి సినిమా ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లే అనిపిస్తుంది. 2022లో త్రివిక్రమ్ సినిమా ఉండొచ్చు.. ఆ తరువాత రాజమౌళి సినిమా అంటే కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. ఈ లెక్కన అనీల్ రావిపూడికి ఛాన్స్ రావాలంటే కష్టమే. అనీల్ రావిపూడితో పాటు మరో డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా మహేష్ తో సినిమా అనుకున్నారు.

ఇప్పుడు ఆయనకు కూడా అవకాశం వచ్చేలా లేదు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి విజయ్ తో చేయబోతున్నారు. మరోపక్క అనీల్ రావిపూడి ‘ఎఫ్ 3’ తరువాత బాలయ్యతో సినిమా చేయాల్సివుంది. రాజమౌళి సినిమా తరువాత మహేష్ కి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు వస్తే.. అప్పుడు ఆ ఇమేజ్ కి తగ్గట్లుగా కథలు ఎన్నుకుంటారేమో!

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus