సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్న మహేష్ బాబు

  • June 26, 2018 / 06:30 AM IST

స్టార్ హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని, అందరూ స్నేహితుల్లా ఉండాలని కోరుకునే వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుంటారు. కోరుకోవడమే కాదు అందుకోసం ముందడుగు వేస్తుంటారు. వెంకటేష్ తో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేశారు. భరత్ అనే నేను సినిమా వేడుకకి ఎన్టీఆర్ ని గెస్ట్ గా పిలిచారు. అంతేకాదు రామ్ చరణ్ తేజ్ తోను కలిసి విహారాలకు వెళుతుంటారు. అయితే ఈ మధ్య చెర్రీ తో తన సినిమా పోటీకి సిద్ధమైంది. అది మంచిది కాదని పక్కకు తప్పుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్నారు.

ఈ మూవీని పెద్ద పండుగకు తీసుకురావాలని నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ ఫిక్స్ అయ్యారు. ఇక రామ్ చరణ్ తేజ్ రంగస్థలం తర్వాత బోయపాటి శ్రీనుతో కల్సి భారీ యాక్షన్ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాని జనవరి 12 న రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత దానయ్య ప్రకటించాడు. డేట్ ఫిక్స్ కావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా మొదలయిపోయింది. ఈ విషయాన్నీ గమనించిన మహేష్ తన చిత్రాన్ని వాయిదా వేసుకున్నారు. వేసవిలో రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. ఈ సీజన్ మహేష్ కి ‘పోకిరి’ ‘భరత్ అనే నేను’ వంటి ఇండస్ట్రీ హిట్లను ఇచ్చింది. యువరాజు, నిజం, నాని, బ్రహ్మోత్సవం వంటి అపజయాలను కూడా ఇచ్చింది. ఈ సారి ఏమి ఇస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus