హీరో భార్యను మోసం చేసి.. 2.9 కోట్లు కొట్టేసింది!

  • December 1, 2021 / 10:23 PM IST

అధిక వడ్డీ ఇప్పిస్తానని టాలీవుడ్ హీరోలతో పాటు మరింకొంతమంది ప్రముఖులను మోసం చేసిన వ్యాపారవేత్త శిల్పా చౌదరి వ్యవహారం సంచలనంగా మారింది. వంద నుంచి 200 కోట్ల మేర శిల్పా చౌదరి పలువురికి కుచ్చు టోపీ పెట్టింది. దివ్య రెడ్డి అనే మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు శిల్పతో పాటు ఆమె భర్తను శనివారం ఉదయం అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ కు తరలించారు. ఇక వారి రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో శిల్పా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు వెలుగులో వచ్చిన ఐదు రోజుల తరువాత ఓ అగ్ర హీరో సోదరి, యంగ్ హీరో భార్య మాదాపూర్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె మరెవరో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి, యంగ్ హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని. బుధవారం(డిసెంబర్ 1) నాడు శిల్ప తన దగ్గర డబ్బు తీసుకొని మోసం చేసిందంటూ ప్రియదర్శిని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తన వద్ద రూ.2.9 కోట్లు తీసుకొని శిల్ప మోసం చేసినట్లు ఆమె పోలీసులకు తెలిపారు. డబ్బుల కోసమే ఆమె ప్రతీ వీకెండ్ లో కిట్టీ పార్టీ ఏర్పాటు చేసేదని ప్రియదర్శిని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus