పక్కా ప్లాన్ తో వెళ్తున్న మహేష్ బాబు

  • June 24, 2018 / 03:01 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబుకి కథ నచ్చితే చాలు.. దర్శకుడు చెప్పిన్నట్లు వెళ్లిపోతుంటారు. సినిమా నిర్మాణంలో చిటికిన వేలు కూడా పెట్టరు. ఏ నిర్మాతతో చేయాలి.. అనే విషయంలో పెద్ద పట్టింపులు కూడా ఉండవు. కానీ ఈ మధ్య బ్రహ్మోత్సవం నిర్మాత పీవీపీ వల్ల కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. అందుకే ఇక నుంచి డైరక్టర్ మాత్రమే కాదు తన సినిమాకి నిర్మాత ఎవరు? అనే దానిపైనా కూడా దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. దీనిని అశ్వినీదత్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డెహ్రాడూన్ లో షూటింగ్ జరుపుకుంటోంది. దీని తర్వాత సుకుమార్, సందీప్ వంగ దర్శకత్వంలో నటించడానికి ఒకే చెప్పారు. ఇప్పుడే నిర్మాతలను ఫైనల్ చేస్తున్నారు.

సుకుమార్ సినిమాని నిర్మించే బాధ్యతలను అల్లు అరవింద్ కి ఇచ్చినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఇక సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీని కేఎస్ రామారావు చేతిలో పెట్టినట్లు తెలిసింది. అతని వద్ద మహేష్ బాబు ఆరేళ్లక్రితం అడ్వాన్స్ తీసుకున్నారంట. అతనితో సినిమా చేద్దామని అనుకుంటే ఇప్పటివరకు కుదరలేదు. దర్శకులే నిర్మాతలను వెంట తీసుకొస్తుండడంతో.. నో చెప్పలేకపోయారు. ఇలా చేసుకుంటూ పోతే తన మాటపై విలువ తగ్గిపోతుందని కేఎస్ రామారావు కు ఈ సినిమాని అప్పగించారని సమాచారం. అయితే ఈ రెండు సినిమాల్లో ఏది మొదలవుతుందో ఇప్పుడే చెప్పలేము. ఈ రెందు కథలు స్క్రిప్ట్ దశలోనే ఉన్నాయి. స్క్రిప్ట్ ఓ కొలిక్కి వస్తే చిత్ర వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus