విదేశాలకు వెళ్లనున్న మహేష్ బృందం
- March 7, 2017 / 06:24 AM ISTByFilmy Focus
ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగ దాస్ డైరక్షన్లో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఈ నెల 11 నుంచి 20 వ తేదీ వరకూ చెన్నైలో జరుగుతుంది. ఆ తరువాత మురుగదాస్ బృందం ‘వియత్నాం’ వెళ్లనుంది.
ఈ నెల 23వ నుంచి 30వ తేదీ వరకూ అక్కడ ఒక యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నారు. ఇందులో మహేష్ బాబు, విలన్ ఎస్.జె సూర్యకు మధ్య ఫైట్ ఉంటుందని సమాచారం. దీనిని పీటర్ హెయిన్స్ డిఫరెంట్ గా కంపోజ్ చేయనున్నారు. ఇంటెలిజన్స్ ఆఫీసర్ గా ప్రిన్స్ నటిస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్ తో ఠాగూర్ మధు, ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ జూన్ 23వ తేదీన విడుదల కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















