గత కొన్ని రోజులుగా తెలుగు సినిమాల్లో అందులోనూ స్టార్ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్ / డూప్ల వినియోగం ఎక్కువైపోయింది అనే చర్చ జరుగుతోంది. అంటే హీరోలకు బదులు అలానే కనిపించే ఇతర నటుల్ని పెట్టి సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ సాయంతో బాడీ డబుల్ ప్లేస్లో ఒరిజినల్ ఫేస్లు తీసుకొస్తున్నారు. ఈ విషయం గురించి మంచు విష్ణు (Manchu Vishnu) దగ్గర ప్రస్తావిస్తే ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ప్రేక్షకుడికి ఇబ్బంది లేనంతవరకు బాడీ డబుల్ ఉంటే తప్పు లేదు.
అయినా జనాలు మారుతున్నారు, ఇలాంటి వాటికి ఓకే అవుతున్నారు అని అంటున్నారు. ఇంతకీ ఏమైందంటే? ‘కన్నప్ప’ (Kannappa) సినిమా విడుదల సందర్భంగా మంచు విష్ణు ఇటీవల వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అలా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాను ఎలా షూట్ చేశారు అనే విషయం గురించి చెప్పారు. ప్రభాస్ (Prabhas) , అక్షయ్ కుమార్ (Akshay Kumar) సీన్స్ ఎలా తీశారు, అన్ని డేట్స్ ఇచ్చారా అని అడిగితే..
వాళ్లు అందరూ ఉండే సీన్స్ ఇతర నటులతో తీసి, ఆ తర్వాత అసలు నటులపై షూట్ చేసి ఎడిట్ చేశాం అని క్లారిటీ ఇచ్చారు. అంటే బాడీ డబుల్స్తో నడిపించేశారు అని అర్థమైంది. ఇలా చేస్తే ప్రేక్షకుడికి ఒరిజినల్ నటుల్ని చూసిన ఫీలింగ్ పోతుంది కదా అంటే.. అప్పుడు అసలు మేటర్కి వచ్చారాయన. ప్రేక్షకుడికి ఇబ్బంది లేనంతవరకు బాడీ డబుల్స్ వాడటం సరైన పనే అని అన్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు ఎవాల్స్ అవుతున్నారని..
ఇలాంటివి అర్థం చేసుకుంటారు అని అన్నారు. ఎందుకు బాడీ డబుల్స్ని పెట్టాల్సి వచ్చింది అనేది అందరికీ తెలుసు అని, అంతేకాదు గతంలో కూడా ఇలా డూప్లు పెట్టే సినిమాలు చేసేవారని గుర్తు చేశారు. అప్పుడు డూప్ విషయం తెలిసిపోయినా మనం వారిని ఓకే అనుకున్నామని.. ఇప్పుడు డూప్ అని తెలియకుండా చేస్తున్నామని చెప్పారు. ఆయన లాజిక్ అలా ఉంది మరి.