ప్రస్తుతం టాలీవుడ్లో నడుస్తున్న అతి పెద్ద ట్రెండ్ రీరిలీజ్. కొత్త సినిమాల్లో స్టఫ్ లేకపోవడం, స్టార్ హీరోలు సమ్మర్ సీజన్లో ముఖం చాటేయడం, పాత సినిమాల ట్రెండ్ను వాడుకోవాలని నిర్మాతలు అనుకోవడం ఇలాంటి కారణాల వల్ల పాత సినిమాలున రీరిలీజ్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతోంది. ఇందులో చాలా సినిమా ఆశించిన ఫలితం అందుకోవడం లేదు. మంచి ఫలితాలు అందుకున్నవి అప్పడు ఫ్లాప్ అయినవే. ఆ విషయం వదిలేస్తే ఈ ట్రెండ్లోకి మరో పాయింట్ని యాడ్ చేశారు ‘లక్ష్మీనరసింహ’ (Lakshmi Narasimha) టీమ్. అదే పాట.
సినిమాలో అప్పుడు పెడదాం అనుకుని, వదిలేసిన పాటను ఇప్పుడు తిరిగి యాడ్ చేసి సినిమాను రీరిలీజ్ చేయబోతున్నారు. ‘మందేసినోడు మహానుభావుడు’ అనే పాటను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. ఆ లిరిక్ సాంగ్ చూస్తుంటే సినిమా షూటింగ్ సమయంలో పాట తీసి నిడివి కోసమో, ఇంకెందుకో కానీ సినిమాలో పెట్టలేదు. ఇప్పుడు సినిమాకి యాడ్ చేస్తున్నారు. అయితే పాట షూట్ అయింది అంటే కచ్చితంగా ట్యూన్ అయిపోయి ఉంటుంది.
అయితే ఆ సినిమాకు సంగీతం అందించిన మణిశర్మ (Mani Sharma) కాకుండా భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) ఇప్పుడు మ్యూజిక్ ఇచ్చారు. బీట్ పరంగా, ట్యూన్ పరంగా పాట అదిరిపోయింది అనే చెప్పాలి. పాట విధానం చూస్తుంటే బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇంట్రడక్షన్ సాంగ్గా ఇది రాబోతోంది. అదేనండీ హోటల్కి వెళ్లి ఇడ్లీ అడిగి చట్నీ, సాంబారు వద్దని బీర్ పోసుకొని తాగుతారే బాలయ్య.. ఆ సీన్ తర్వాత ఈ పాట వచ్చే అవకాశం ఉంది.
ఈ పాట యాడింగ్ కాన్సెప్ట్ కానీ క్లిక్ అయితే ఇకపై సినిమాల రీరిలీజ్లు అంటే కచ్చితంగా అప్పుడు వాడని ఫుటేజ్, సాంగ్స్ను బయటకు తీస్తారు. అదనపు సన్నివేశాలు ఉన్నాయి మా సినిమా చూడండి అని పిలుపులు కూడా ఇస్తారు. మరి ఈ ప్రయత్నం ‘లక్ష్మీనరసింహ’ (Lakshmi Narasimha) సినిమాకు ఉపయోగపడుతుందో లేదో చూడాలి.