Chiranjeevi, Nagarjuna: ‘నాగార్జున 100 ‘ కోసం అనుకున్న కథ చిరు వద్దకి వెళ్లిందా?

  • May 23, 2024 / 11:48 AM IST

20 ఏళ్ళ తర్వాత ‘గాడ్ ఫాదర్’ (God Father) చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja).. రీ ఎంట్రీలో కూడా తన డైరెక్షన్ స్టామినా ఏంటనేది ప్రూవ్ చేసుకున్నాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాన్ని సాధించకపోయినా మోహన్ రాజా డైరెక్షన్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఎలాంటి కథనైనా అతను ఓన్ చేసుకుని తెరపై ఆవిష్కరించే విధానం సూపర్. అయితే ‘గాడ్ ఫాదర్’ తర్వాత నాగార్జునతో (Nagarjuna) ఓ సినిమాని ప్లాన్ చేశాడు మోహన్ రాజా.

నాగార్జునకి కథ నచ్చింది. కథ ప్రకారం ఇంకో హీరోకి ఛాన్స్ ఉంది కాబట్టి.. అఖిల్ ని (Akhil) కూడా ఇరికిద్దాం అనుకున్నారు. నాగార్జున 99 లేదా 100 వ ప్రాజెక్టుల్లో ఒకటి ఇది అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ ఎందుకో నాగ్ సంతృప్తి చెందలేదు. మోహన్ రాజాని హోల్డ్ లో పెడుతూ వచ్చాడు. ఇన్నాళ్లు వెయిట్ చేయించి.. ఇప్పుడు ఆ ప్రాజెక్టు చేయలేను అని మోహన్ రాజాకి నాగార్జున చెప్పినట్లు తెలుస్తుంది.

దీంతో చిరుని (Chiranjeevi) అప్రోచ్ అయ్యాడు మోహన్ రాజా. అదే కథ చిరుకి చెప్పి.. కొన్ని మార్పులతో స్క్రిప్ట్ ను లాక్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టులో ఇంకో హీరోకి ఛాన్స్ ఉంది కాబట్టి.. వరుణ్ (Varun Tej) , వైష్ణవ్ (Panja Vaisshnav Tej) , సాయి దుర్గా తేజ్ (Sai Dharam Tej)  ..లలో ఒకరు ఈ ప్రాజెక్టులో భాగం అవ్వొచ్చు అని ఇన్సైడ్ టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus