ఎస్వీఆర్ గా నటించనున్న మోహన్ బాబు
- June 24, 2017 / 12:00 PM ISTByFilmy Focus
అభినేత్రి సావిత్రి బయోపిక్ మూవీ ‘మహానటి’ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్న దత్ ‘స్వప్న సినిమా’ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా, క్యూట్ బ్యూటీ సమంత కథలో కీలక పాత్ర పోషిస్తోంది. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నాడు. అలనాటి విలక్షణ నటుడు ఎస్ వీ రంగారావు పాత్రలో మోహన్ బాబుని నటింపజేయించాలని చిత్ర బృందం ప్రయత్నిస్తోంది.
ఆ పాత్రలో మొదట ప్రకాష్ రాజ్ ని అనుకున్నప్పటికీ, మోహన్ బాబు అయితే మరింత బాగుటుందని ఆలోచిస్తోంది. మహానటిలో నటించడానికి మోహన్ బాబు ఓకే చెప్పిన వెంటనే అధికారిక ప్రకటన చేయనున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ గండిపేటలో జరుగుతోంది. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ లపై కీలక సన్నివేశాల చిత్రీకరిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












