“విక్రమ్ వేద” సినిమా తెలుగు రీమేక్ లో నటించనున్న నాగ్
- August 23, 2017 / 08:33 AM ISTByFilmy Focus
కథ బాగుంటే చాలు.. అది రీమేకా? సీక్వెలా? అని పట్టించుకోరు కింగ్ నాగార్జున. విభిన్న కథలను, కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో ఆయన ఎల్లప్పుడూ ముందుంటారు. గతంలో గగనం వంటి పాటల్లేని సినిమా చేసిన ఆయన రీసెంట్ గా “ఊపిరి”లో కాళ్లు కదపలేని పాత్రలో నటించి మెప్పించారు. ఆలాగే రాజు గారి గది సినిమా సీక్వెల్ ల్లో నటిస్తున్నారు. తాజాగా ఓ తమిళ చిత్రాన్ని రీమేక్ చేయనున్నట్లు సమాచారం. విజరు సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రధారులుగా తమిళంలో వచ్చిన చిత్రం “విక్రమ్ వేద”. పుష్కర్, గాయత్రి దర్శకద్వయం తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై భారీ విజయాన్ని సాధించింది. క్రైమ్ మిస్టరీ జాన్రాలో రూపొందిన ఈ చిత్రంలో పోలీస్ అధికారి పాత్రలో మాధవన్, గ్యాంగ్స్టర్గా విజరు సేతుపతి నటించి ఆకట్టుకున్నారు.
10 కోట్లతో నిర్మితమై 80 కోట్లకు పైగా వసూలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. భారీ లాభాలను చూసిన నిర్మాత శశికాంత్ ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని భావించారు. మాధవన్ పాత్రలో వెంకటేష్ను, విజరు సేతుపతి పాత్రలో రానాను నటింప చేయించాలనుకున్నారు. కానీ తాజాగా అది కాస్త మాధవన్, నాగార్జున కాంబినేషన్కి మారిందట. ఈ విషయమై ఆయన నాగార్జునతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













