Namrata: రీ ఎంట్రీ పై స్పందించిన నమ్రత..!

  • June 9, 2022 / 06:41 PM IST

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరొద్కర్‌ అందరికీ సుపరిచితమే. మహేష్ ను పెళ్లి చేసుకోవడానికి ముందు ఈమె ఓ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్లో హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో.. చిరంజీవి- కోడి రామకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అంజి’ చిత్రంలో ఆఫర్ రావడంతో ఈమె టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ చిత్రం షూటింగ్ ఆలస్యం అవ్వడంతో ఈమె మహేష్ బాబుతో చేసిన ‘వంశీ’ చిత్రం ముందుగా రిలీజ్ అయ్యింది.

ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఈమె మహేష్ తో ప్రేమలో పడింది. ‘2005’ లో వీరి వివాహం కూడా జరిగింది. దాంతో సినిమాలకు గుడ్‌బై చెప్పింది. అప్పటి నుండీ కుటుంబ బాధ్యతలు, బిజినెస్‌ వ్యవహరాలతో బిజీ అయిపోయింది. మహేష్ సినిమాలకు సంబంధించిన అన్ని విషయాలు ఈమె దగ్గరుండి చూసుకుంటుంది. ప్రమోషన్లు, మహేష్ బ్రాండ్స్ వంటి విషయాల్లో నమ్రత ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అయితే కొద్దిరోజులుగా ఈమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది అనే టాక్ నడుస్తుంది.

ఈ వార్తల పై ఆమె తాజాగా క్లారిటీ ఇచ్చింది. నమ్రత మాట్లాడుతూ.. “నేను తిరిగి సినిమాల్లో నటించబోతున్నాను అంటూ చాలా వార్తలు వస్తున్నాయి. నిజానికి చాలా మంది కోరుకుంటున్నారు అనుకుంట. అయితే వాళ్ళను నేను ఎప్పుడు హర్ట్‌ చేస్తూనే ఉన్నాను. ప్రస్తుతం నేను నా కుటుంబ బాధ్యతలు చూసుకోవడంలో బిజీగా ఉన్నాను.

నాకు అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి సినిమాలపై నేను దృష్టి పెట్టలేను. మళ్ళీ సినిమాల్లో నటించాలి అనే ఆసక్తి కూడా నాకు లేదు. భవిష్యత్తులో కూడా అలాంటి ఆలోచన రాకపోవచ్చు’ అంటూ నమ్రత క్లారిటీ ఇచ్చింది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus