ఎన్టీఆర్ కి విలన్ గా అతను నటించడం లేదు
- June 10, 2017 / 07:54 AM ISTByFilmy Focus
బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘జైలవకుశ’ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీలో 2 కోట్లతో వేసిన భారీ సెట్ లో కీలక సీన్లకు తెరకెక్కిస్తున్నారు. నిన్నటి నుంచి మొదలయిన మూడో షెడ్యూల్ లో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ కూడా జాయిన్ అయినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అతని జై లవకుశలో విలన్ గా నటిస్తున్నట్లు రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తపై చిత్ర బృందం స్పందించింది. తమ సినిమాలో విలన్ గా నీల్ నితిన్ ముఖేష్ నటించడం లేదని స్పష్టం చేసింది. దీంతో ఈ గాసిప్ కి చెక్ పెట్టింది.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారక్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్, నందితా రాజ్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ కి సూపర్ పాటలను ఇచ్చిన దేవీ శ్రీ ప్రసాద్ జై లవకుశకి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చే పనిలో ఉన్నారు. ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ కి థియేటర్లోకి రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















