‘సర్కారు వారి పాట’ : మహేష్ ట్వీట్ వెనుక అంత అర్ధం ఉందా?

  • January 7, 2021 / 09:36 PM IST

మహేష్ బాబు గతంలో ఎవ్వరినీ ఉద్దేశించి కామెంట్లు చేసేవాడు కాదు. అయితే ‘మహర్షి’ సినిమా విడుదల టైం నుండీ అతనిలో చాలా మార్పులు వచ్చాయి. అతను ఏ విషయాన్ని మనసులో దాచుకోవడం లేదు. సోషల్ మీడియా సాక్షిగా బయటపెట్టేస్తున్నాడు. వాటికి అతను ఇచ్చే విశ్లేషణ ఎలా ఉన్నా.. అతని ఇంటెన్సిటీని మాత్రం మొదటి స్పందన లేదా ట్వీట్ లోనే అందరికీ కన్వే అయ్యేలా చేస్తున్నాయి. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే..

తాను నటించబోయే తరువాతి చిత్రం ‘సర్కారు వారి పాట’ సినిమా విషయంలో కీలక అప్డేట్ లను మహేష్ బాబే రివీల్ చేస్తుండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుందనే చెప్పాలి. మొన్నటికి మొన్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో కీర్తి సురేష్ నే హీరోయిన్ గా సెలక్ట్ చేసినట్టు కన్ఫార్మ్ చేసాడు. అప్పటివరకూ చిత్ర యూనిట్ సభ్యులు కీర్తి సురేషే హీరోయిన్ అన్న విషయాన్ని ప్రకటించలేదు. కానీ మహేష్ రివీల్ చేసేసాడు. ఇక ‘సర్కారు వారి పాట’ సినిమా ప్రారంభంలో పి.ఎస్.వినోద్ ను కెమెరామెన్ గా తీసుకున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

కానీ కొన్ని కారణాల వల్ల అతను తప్పుకున్నాడని ప్రచారం జరిగింది. అలా అని ఆ విషయం పై దర్శకనిర్మాతలు క్లారిటీ ఇవ్వలేదు. అయితే మహేష్ మాత్రం ఈరోజు కన్ఫార్మ్ చేసాడు. ‘సర్కారు వారి పాట’ కు మది ని తీసుకోబోతున్నట్టు మహేష్ చెప్పుకొచ్చాడు. ఈరోజు కెమెరామెన్ మది పుట్టినరోజు కావడంతో అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ మహేష్ ఈ విషయాన్ని తెలిపాడు. ఇలా పి.ఎస్.వినోద్ తమ ప్రాజెక్టు నుండీ తప్పుకున్నాడు అనే విషయాన్ని ఇండైరెక్ట్ గా రివీల్ చేసాడు మహేష్.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus