స్వయంగా డబ్బింగ్ చెప్పుకోనున్న నివేదా థామస్
- July 14, 2017 / 11:36 AM ISTByFilmy Focus
నేచురల్ స్టార్ నాని “జెంటిల్ మ్యాన్” సినిమాతో నివేదా థామస్ తెలుగు వారికీ పరిచయమైంది. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. అంతేకాదు రెండో సినిమా కూడా నాని తో చేసి మరో హిట్ సొంతం చేసుకుంది. వీరిద్దరి కలయికలో వచ్చిన నిన్నుకోరి మంచి కలక్షన్స్ తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి నటిస్తోంది. జై లవకుశ సినిమాలోని జై పాత్రకు జోడీగా కనిపించనుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మరో వైపు ఎడిటింగ్ కూడా చేస్తున్నారు. త్వరలో డబ్బింగ్ పనులు మొదలు పెట్టనున్నారు. అప్పటి లోపున తెలుగు భాషను స్పష్టంగా నేర్చుకోవాలని నివేదా శ్రమిస్తోంది. ఇందులో ఆమె సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని తెలుగు ప్రేక్షకులకు తన సొంత వాయిస్ తో ఆకట్టుకోవాలని భావిస్తోంది.
నివేదా మాతృ భాష మలయాళం అయినప్పటికీ సంవత్సరం నుంచి తెలుగు నేర్చుకుంటోంది. ‘‘ప్రపంచంలోనే అతి క్లిష్టమైన భాష మలయాళమేనని అనుకునేదాన్ని. కానీ హైదరాబాద్లో అడుగుపెట్టినప్పుడు తెలుగు మాట్లాడేవారిని చూస్తే భయమేసింది. అసలు ఆ పదాలకు వీళ్ల నోళ్లెలా తిరుగుతున్నాయా? అనిపించింది నేనిప్పుడు తెలుగు మాట్లాడటం చూసి నా ఫ్రెండ్స్ ఆశ్చర్యపోతున్నారు.’’ అని నివేదా వివరించింది. సో జై లవకుశలో నివేదా సొంత గొంతుని మనం విననున్నాం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














