చిలుకూరు టెంపుల్ వద్ద ఎన్టీఆర్ పెళ్లి సీన్
- April 24, 2017 / 07:42 AM ISTByFilmy Focus
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవ కుశ సినిమా షూటింగ్ మొన్నటివరకు రామోజీఫిల్మ్ సిటీలో వేసిన సెట్ లో జరిగింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో 55 కోట్ల బడ్జెట్ తో కల్యాణ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిలుకూరు బాలాజీ టెంపుల్ కి సమీపంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో తారక్ పక్కన ముగ్గురు భామలు నటిస్తున్న సంగతి తెలిసిందే. రాశీ ఖన్నా, నివేత థామస్, నందిత రాజ్ లు ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయనున్నారు. అయితే తారక్ మూడు పాత్రల్లో ఒకరు రాశీ ఖన్నాను పెళ్లిచేసుకుంటారు. ఆ పాత్ర ఎవరో కరక్ట్ గా తెలియదు గాని .. వారిద్దరి పెళ్లిని చాలా అందంగా బాబీ తెరకెక్కిస్తున్నారు.
బాలీవుడ్ కెమెరా మెన్ సీ కే మురళీధరన్ పెళ్లి వేడుకను ఎంతో చక్కగా కెమెరాలో బందిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని తారక్ పుట్టినరోజైన మే 20 వ తేదీన విడుదల చేయాలనీ నిర్మాత కళ్యాణ్ రామ్ భావిస్తున్నారు. హాలీవుడ్ లెగసీ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ వాన్సీ హార్ట్ వెల్ వంటి ప్రముఖ టెక్నీషియన్లు పని చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














