రెండు రోజుల్లో తారక్ కొత్త సినిమా ముహూర్తపు తేదీ ప్రకటన!
- December 5, 2016 / 10:14 AM ISTByFilmy Focus
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో విజయాన్ని అందుకోవడానికి సైలంట్ గా పనులను చక్కదిద్దుతున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత ఆయన చేయనున్న సినిమా ప్రీ పొడక్షన్ వర్క్ దాదాపు పూర్తి అయింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్న ఈ ఫిల్మ్ కి దర్శకుడిగా బాబీ (కె.ఎస్.రవీంద్ర) ఖరారయ్యారు. మాస్ మహారాజ రవితేజ పవర్ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఈ డైరక్టర్, నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ తెరకెక్కించారు. ఇప్పుడు తారక్ ని డైరక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నారు. రెండు షేడ్స్ ఉన్న క్యారక్టర్ ని డిజైన్ చేసి ఎన్టీఆర్ ని మెప్పించిన బాబీ, వేగంగా స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసి ఛాన్స్ కొట్టేశారు.
కథ, స్క్రిప్ట్ ఓకే కావడంతో నిర్మాత కళ్యాణ్ రామ్ సినిమాను ప్రారంభించడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఈ వారంలో మంచి ముహూర్తం ఉంటే చూడమని పండితులకు చెప్పారంట. ఎన్టీఆర్ 27వ సినిమా ముహూర్తపు షాట్ ఎప్పుడు తీస్తారో … మరో రెండు రోజుల్లో ప్రకటన వెలువడనుంది. మూడు నెలలుగా ఎన్టీఆర్ ఏ సినిమాను ఒకే చేయకపోవడంతో నిరుత్సాహంగా ఉన్న అభిమానులకు ఇది శుభవార్త కానుంది. బాబీ పై ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఎన్టీఆర్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గకుండా పవర్ ఫుల్ సినిమా తీస్తారని ధీమాగా చెబుతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















