ఆ రీమేక్ చేయనని చెప్పిన ఎన్టీఆర్
- July 20, 2017 / 01:40 PM ISTByFilmy Focus
బాబీ దర్శకత్వంలో యంగ్టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న ‘జైలవకుశ’ చిత్రం షూటింగ్ పూణేలో వేగంగా సాగుతోంది. ఈ సినిమాతో పాటు బిగ్ బాస్ షోతో తారక్ బిజీగా ఉన్నారు. ఈరెండు పనులు సెప్టెంబర్ 21 తో పూర్తి అవుతాయి. దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కుటుంబ కథా చిత్రం చేయనున్నారు. దీని తర్వాత సినిమాని కూడా తారక్ ఖరారు చేశారని వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల కన్నడలో సూపర్ హిట్ అయిన ‘రాజాకుమార’ను ఇష్టపడి ఆ కథను తెలుగులో తీయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ షికారు చేశాయి.
అందులో హీరోగా నటించిన పునీత్ రాజ్కుమార్, ఎన్టీఆర్ మధ్య మంచి స్నేహం ఉందని, ఆ పరిచయంతో ఆ మూవీ రైట్స్ ఇచ్చారని కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను ఎన్టీఆర్ మీడియా పర్సన్ ఖండించారు. ఆ సినిమా రీమేక్ ఎన్టీఆర్ చేయడం లేదని స్పష్టం చేశారు. తారక్ ఇప్పుడు ‘జైలవకుశ’ చిత్రాన్ని సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంపైనే దృష్టిపెట్టారని వెల్లడించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















