Om Raut: ఆదిపురుష్ అసలు రేటుతో మరో కవర్ డ్రైవ్!

ప్రభాస్ (Prabhas) హీరోగా, కృతి సనన్ (Kriti Sanon) హీరోయిన్‌గా ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిపురుష్’ (Adipurush) బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమా రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, విడుదలైన తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. సినిమాలోని డైలాగ్స్, విజువల్ ఎఫెక్ట్స్, కథనం అభిమానులను, ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఈ ఫ్లాప్ వల్ల బాలీవుడ్‌లో ఇప్పుడు నితీష్ తివారీ  (Nitesh Tiwari) రణ్‌బీర్ కపూర్‌తో (Ranbir Kapoor) మరో రామాయణం తీస్తున్నాడు. అయినప్పటికీ, ఓం రౌత్ మాత్రం ‘ఆదిపురుష్’ ఫ్లాప్ కాదని మళ్లీ వాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Om Raut

‘వేవ్స్ 2025’ సమ్మిట్‌లో ఇటీవల పాల్గొన్న ఓం రౌత్, ‘ఆదిపురుష్’ గురించి మాట్లాడుతూ తన సినిమాను సమర్థించుకున్నాడు. తెలుగు థియేటర్ హక్కులు రూ.120 కోట్లకు అమ్ముడుపోయాయని, అంత భారీ రేటుకు కొనుగోలు చేసారంటే చాలామంది సినిమా చూశారని, తన లక్ష్యం ఆడియన్స్‌ను రీచ్ చేయడమేనని, అది సాధించానని చెప్పాడు. ఈ కామెంట్స్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఆగ్రహానికి గురిచేశాయి. సినిమా ఫ్లాప్‌ను ఒప్పుకోకుండా ఇలా కవర్ చేయడం హాస్యాస్పదంగా ఉందని వారు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.

‘ఆదిపురుష్’లో రావణుడిగా నటించిన సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) కూడా ఇటీవల తన కొడుక్కి సినిమా చూపించిన తర్వాత సారీ చెప్పానని వ్యాఖ్యానించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓం రౌత్ మాత్రం తన సినిమాను గట్టిగా సమర్థించడం చర్చనీయాంశంగా మారింది. సినిమా విజయం కంటే ఆడియన్స్ రీచ్ ముఖ్యమని ఓం రౌత్ చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు ప్రభాస్ ఫ్యాన్స్‌లో మరింత ఆగ్రహాన్ని రేకెత్తించాయి.

తప్పు ఒప్పుకోవడం హుందాతనానికి సంకేతమని, ఓం రౌత్ ఇలా కవర్ చేయడం సరికాదని ఫ్యాన్స్ అంటున్నారు. ‘ఆదిపురుష్’ ఫ్లాప్‌తో ప్రభాస్ ఇమేజ్‌కు కొంత డ్యామేజ్ అయినా, ఆ తర్వాత ‘సలార్’(Salaar) , కల్కి’(Kalki 2898 AD) సినిమాలతో ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఓం రౌత్ ఈ వివాదాస్పద కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి, ఫ్యాన్స్ మాత్రం ఆయన తీరుపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

స్టార్ హీరోలను ఇంప్రెస్ చేయడానికి నాగవంశీ పాట్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus