Virata Parvam: ‘విరాటపర్వం’ క్లైమాక్స్ మరొకరు డైరెక్ట్ చేశారా..?

Advertisement

దగ్గుబాటి రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రియమణి ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఈపాటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది. కానీ కరోనా కారణంగా రిలీజ్ డేట్ వాయిదా పడింది. త్వరలోనే మంచి రోజు చూసుకొని సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు వేణు ఊడుగుల అనివార్య కారణాల వలన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించలేకపోయారట. ఆయన స్థానంలో మరో దర్శకుడు ఆ బాధ్యతను తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. నిజానికి ఏప్రిల్ లో సినిమా రిలీజ్ అనుకున్నారు. రిలీజ్ డేట్ కూడా ప్రకటించడంతో టైమ్ కి పూర్తి చేయాలనే ఒత్తిడి పెరిగింది. ఆ సమయంలో వేణు ఊడుగుల అందుబాటులో లేకపోవడంతో ఆయనకు బదులుగా మరో దర్శకుడితో పతాక సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం.

అయితే ఈ విషయం బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారట. కొన్ని రోజులుగా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై క్లారిటీ రావాల్సివుంది. ద‌గ్గుబాటి సురేష్ బాబు, సుధాక‌ర్‌ చెరుకూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news