Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!
- May 14, 2025 / 08:08 PM ISTByFilmy Focus Desk
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి, 80 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఈ దాడి ద్వారా భారత్ తన శక్తిని చాటుకుని, పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఈ సంఘటన తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి, సోషల్ మీడియాలో ఈ అంశం హాట్ టాపిక్గా మారింది.
Operation Sindoor

ఈ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావం తెలపడానికి అనేక మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ముందుకొచ్చారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar) మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ గురించి ట్వీట్ చేస్తూ, “జై హింద్.. జై మహాకాల్” అని రాసుకొచ్చాడు. అయితే, ఈ ట్వీట్ తర్వాత అతను ఊహించని షాక్ను ఎదుర్కొన్నాడు. అక్షయ్ సుమారు 4.2 మిలియన్ల మంది ఫాలోవర్స్ను కోల్పోయాడని సమాచారం. అతనితో పాటు అలియా భట్ (Alia Bhatt), శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor), సారా అలీ ఖాన్ (Sara Ali Khan) వంటి స్టార్లు కూడా లక్షలాది మంది అనుచరులను కోల్పోయారు, వీరిని అన్ఫాలో చేసిన వారు ఎక్కువగా పాకిస్తాన్ యూజర్లేనని తెలుస్తోంది.
మరోవైపు, పాకిస్తాన్ నటీనటులు మహిరా ఖాన్, ఫవాద్ ఖాన్, హనియా అమీర్ వంటి వారు భారత్ దాడిని “పిరికి చర్య” అంటూ విమర్శలు గుప్పించారు. వారి వ్యాఖ్యలపై భారత నెటిజన్లు తీవ్రంగా స్పందించారు, సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపించారు. ఈ విషయంలో ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ కూడా ముందుకొచ్చింది. పాక్ నటీనటుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, వారిని భారత చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలని, కళల పేరుతో వారికి మద్దతు ఇవ్వొద్దని, భారతీయులు వారిని అభిమానించొద్దని కోరింది.

ఈ ఘటన భారత్-పాక్ సెలబ్రిటీల మధ్య సోషల్ మీడియా యుద్ధంగా మారింది. ఆపరేషన్ సిందూర్కు (Operation Sindoor) మద్దతుగా భారత స్టార్లు చేసిన పోస్టులు వారి ఫాలోవర్స్ సంఖ్యపై ఊహించని ప్రభావాన్ని చూపాయి. అక్షయ్ కుమార్ వంటి స్టార్లు లక్షలాది ఫాలోవర్స్ను కోల్పోవడం వారి సోషల్ మీడియా ఇమేజ్పై ప్రభావం చూపినప్పటికీ, వారు దేశభక్తి స్ఫూర్తిని చాటుకున్నారు. ఈ ఉద్రిక్తతలు సెలబ్రిటీల సోషల్ మీడియా ఫాలోయింగ్పై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఆసక్తికరంగా మారింది.












