Parasuram: పవన్ తో సినిమా చేస్తానన్న పరశురామ్.. కానీ?

  • May 21, 2022 / 05:15 PM IST

స్టార్ హీరో మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లను పెంచడం వల్ల సులువుగానే 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమాకు 102.39 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ఈ వీకెండ్ కలెక్షన్లను బట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మహేష్ బాబు మాత్రం ఈ సినిమా రిజల్ట్ విషయంలో సంతృప్తితో ఉన్నారు.

ఈ సినిమాకు వచ్చిన టాక్ తో పోల్చి చూస్తే ఈ సినిమా కలెక్షన్లు మెరుగైనవే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే సర్కారు వారి పాట సినిమాలో సుబ్బరాజు ఫోన్ కు లాలా భీమ్లా రింగ్ టోన్ ఉండటం గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరిగింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పరశురామ్ మాట్లాడుతూ ఆ ప్రశ్నకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. వేరే రింగ్ టోన్ పెడితే సినిమాలో ఆడియో సరిగ్గా వినిపించడం లేదని ఆయన అన్నారు.

అందువల్ల తాను, థమన్ సినిమాలో భీమ్లా నాయక్ రింగ్ టోన్ ను పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని పరశురామ్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ను కలిసి మంచి కథ వినిపిస్తానని పవన్ తో సినిమా తీస్తానని పరశురామ్ కామెంట్లు చేశారు. సర్కారు వారి పాట సినిమా స్టార్టింగ్ సీన్ లో కూడా ముసలావిడ మహేశ్ బాబును చిరంజీవి పచ్చబొట్టు కావాలా? లేక కృష్ణ పచ్చబొట్టు కావాలా? అని అడుగుతుంది.

సినిమాలో చిరంజీవి పేరు వినిపించడంతో మెగా అభిమానులు సైతం ఎంతగానో సంతోషించడం గమనార్హం. పరశురామ్ తర్వాత సినిమాలో నాగచైతన్య హీరో కాగా ఈ సినిమాతో కూడా పరశురామ్ సక్సెస్ ను అందుకుంటే స్టార్ హీరోల నుంచి ఆయనకు మరిన్ని ఆఫర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. పరశురామ్ తర్వాత సినిమాలతో కూడా సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus