People Media And Pawan Kalyan: అప్పుడెప్పుడో ఇచ్చిన మాట.. ఇప్పుడు షురూ చేయబోతున్న పవన్‌

పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌ పెట్టి చాలా ఏళ్లు అయింది. దాని మీద వరుస సినిమాలు తెరకెక్కించాలని ఆయన అప్పట్లో ప్లాన్స్‌ చేశారు. అయితే అవేవీ వర్కవుట్‌ కాలేదు. ఆ తర్వాత ఇతర నిర్మాణ సంస్థలతో కలసి సినిమాలు చేసేందుకు ట్రై చేశారు. అవి కూడా పట్టాలెక్కలేదు. అయితే నితిన్‌ 25వ సినిమా ‘ఛల్‌ మోహనరంగా’తో ఇండస్ట్రీలోకి ప్రవేశించింది ఆ బ్యానర్‌. ఆ తర్వాత ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా తర్వాత పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీతో డీల్‌ గురించి అనౌన్స్‌ చేశారు.

People Media And Pawan Kalyan

ఇదంతా ఓకే కానీ.. ఇప్పుడు ఆ బ్యానర్‌ గురించి ఎందుకు అనుకుంటున్నారా? మరోసారి ఈ బ్యానర్‌ని పవన్‌ కల్యాణ్‌ బయటకు తీశారు. దీని కోసం ప్రత్యేకంగా ఎక్స్‌ పేజీని సిద్ధం చేశారు. అందులో కటానా, కెంజుట్సు గురించి, పవన్‌ కల్యాణ్ అందుకున్న గౌరవం గురించి వీడియోలు పోస్టు చేశారు. దీంతో దీని కోసమే ఈ పేజీ పెట్టారా అనుకున్నారంతా. అయితే ఆ పేజీ ఉద్దేశం అందులో వరుస సినిమాలు తీయడమే అని తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చారు.

యువ దర్శకులు, యువ హీరోలతో వరుస సినిమాలు చేసే ఆలోచనలో పవన్‌ ఉన్నారట. ఈ క్రమంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీతో కలసి 15 సినిమాలకు చేసిన ప్లాన్‌ను బయటకు తీశారు. దీని కోసం పవన్‌, పీపుల్ మీడియా విశ్వప్రసాద్‌ కలిశారు. త్వరలోనే ఆ ప్రాజెక్టుల్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కథలపై చర్చించడానికి అవకాశం కల్పించినందుకు పవన్‌ కల్యాణ్‌కు కృతజ్ఞతలు అంటూ టీజీ విశ్వప్రసాద్‌ ఓ ట్వీట్‌లో తెలిపారు కూడా.

ప్రేక్షకులకు మంచి కంటెంట్‌ని అందించేందుకు పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌తో కలిసి పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ కలయిక మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. ఈ ప్రయాణం కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాం అని ఆ పోస్టులో రాసుకొచ్చారు. మరి ఈ బ్యానర్ల కలయికలో ఎలాంటి సినిమాలు రానున్నాయి, ఎవరితో ఎవరు చేస్తారు అనేది చూడాలి.

అన్ని ఇండస్ట్రీలను టచ్‌ చేసేసిన ‘జైలర్‌’.. ఈసారి టార్గెట్‌ రీచ్‌ అవ్వాలనేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus