పండుగాడిగా మహేష్ ని మరో మారు వెండితెరపై చుడండి

  • March 16, 2020 / 01:23 PM IST

ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు…, నేను ఎంత ఎదవనో నాకే తెలియదు.., ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా..బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం.. అంటూ పోకిరి సినిమాలో మహేష్ వీర విహారం చేశారు. దర్శకుడు పూరి జగన్నాధ్ రాసిన ఈ డైలాగ్స్ మహేష్ నోటినుండి ఓ రేంజ్ లో తెరపై పేలాయి. అప్పట్లో ఈ డైలాగ్స్ సూపర్ ఫేమస్. పూరి పోకిరి చిత్రంలో మహేష్ ని సరికొత్తగా ఆవిష్కరించారు. దీనితో అప్పట్లో ఈ చిత్రం పెద్ద సంచలనం. 2006లో విడుదలైన ఈ చిత్రం అనేక రికార్డ్స్ చెరిపివేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

కాగా ఈ మూవీ వచ్చే నెల 28కి 14ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. దీనితో మహేష్ అభిమానుల కోసం పోకిరి సినిమా ప్రత్యేక షో ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 28న పోకిరి ప్రత్యేక ప్రదర్శన వెండితెరపై జరగనుంది. కాబట్టి మహేష్ అభిమానులు మరో మారు పండుగాడు వీర విహారం చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక మహేష్ నెక్స్ట్ మూవీ దర్శకుడిపై సందిగ్దత కొనసాగుతుంది. వంశీ పైడిపల్లితో మూవీ ఆగిపోయిన నేపథ్యంలో ఆయన తదుపరి చిత్రం ఎవరితో చేస్తారు అనే ఆసక్తి కొనసాగుతుంది. గీత గోవిందం మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు పరుశురాం పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఐతే త్వరలోనే మహేష్ తన కొత్త చిత్రానికి సంబంధించిన ప్రకటన చేయనున్నారు.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus