సినీ సెలబ్రిటీలకు టోకరా.. మహిళా అరెస్ట్!

  • November 27, 2021 / 06:47 PM IST

అధిక వడ్డీ ఇప్పిస్తానంటూ వందల కోట్ల రూపాయలు మోసం చేసిన వ్యాపారవేత్త శిల్పా చౌదరి వ్యవహారం బయటపడింది. సినీ సెలబ్రిటీలతో పాటు నగరానికి చెందిన ప్రముఖులను కూడా శిల్పా మోసం చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దాదాపు వంద నుంచి రెండు వందల కోట్ల వరకు మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన నార్సింగ్ పోలీసులు శిల్పా, ఆమె భర్తను శనివారం ఉదయం అరెస్ట్ చేశారు.

శిల్పా బాధితుల్లో టాలీవుడ్ కి చెందిన ముగ్గురు హీరోలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పేజ్ 3 పార్టీలతో సెలబ్రిటీలను ఆకర్షిస్తూ శిల్పా మోసపూరితంగా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. దీంతో తాము మోసపోయామని ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు వరుసగా పోలీస్ స్టేషన్ కు క్యూ కడుతున్నారు. పార్టీల్లో ప్రముఖుల పేర్లు చెప్పి ఎక్కువ వడ్డీ ఇప్పిస్తానని.. శిల్ప వందల కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

బాధితుల ఫిర్యాదుతో శిల్ప ఆమె భర్తపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం వారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. శిల్పా మోసం చేసిన వారిలో టాలీవుడ్ హీరోలతో పాటు ఎందరో వ్యాపారవేత్తలు, లాయర్లు ఉన్నట్లు సమాచారం.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus