Pooja Hegde: విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయనున్న బుట్టబొమ్మ..!

  • May 13, 2022 / 11:07 PM IST

‘జన గణ మన’ పూరి జగన్నాథ్ డ్రీం ప్రాజెక్టు. 2014 నుండీ ఈ ప్రాజెక్టు పై కసరత్తులు చేస్తున్నాడు. మొదట మహేష్ బాబుతో తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించాడు. కానీ కొన్ని కారణాల వల్ల మహేష్ ఈ ప్రాజెక్టుని చేయలేకపోయాడు.ఆ తర్వాత పవన్ కళ్యాణ్, ప్రభాస్, ‘కె.జి.ఎఫ్ యష్’ వంటి హీరోలను సంప్రదించాడు.వాళ్ళు కూడా ఈ ప్రాజెక్టు చేయలేకపోయారు. దీంతో చివరికి తన లైగర్ హీరో విజయ్ దేవరకొండనే ఫిక్స్ చేసుకున్నాడు. పాన్ ఇండియా మూవీగా ‘జె.జి.ఎం’ టైటిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.

ఈ మధ్యనే ముంబైలో లాంఛనంగా ప్రారంభమైంది ఈ మూవీ.మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనుంది. 2023 వ సంవత్సరం ఆగస్ట్ 3న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు కూడా వెల్లడించాడు పూరి. పూరి జగన్నాథ్, ఛార్మిలతో కలిసి వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట జాన్వీ కపూర్, కైరా అద్వానీలని అనుకున్నాడు పూరి. చివరికి పూజ హెగ్డేని ఫిక్స్ చేశాడట.

ఈ ప్రాజెక్టుకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది. ఆమె పాన్ ఇండియా హీరోయిన్ కాబట్టి.. ఈ ప్రాజెక్టుకి పర్ఫెక్ట్ అని చిత్ర బృందం భావిస్తోంది. అయితే పూజకి ఈ మధ్య కాలంలో హిట్లు లేవు. కానీ పూరికి అలాంటి భయాలు ఉండవు. అతని సినిమాలతో గోల్డెన్ లెగ్ లుగా మారిన హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus