Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు
- February 20, 2026 / 03:35 PM ISTByPhani Kumar
ఏ స్టార్ హీరో కూడా తన ప్లాప్ సినిమాల గురించి బహిరంగంగా పదే పదే మాట్లాడరు. అందుకు ఇమేజ్ అడ్డొస్తుంది అనుకుంట. కానీ మన ప్రభాస్(Prabhas) అలాంటివి ఏమీ పట్టించుకోడు. అందుకే అనుకుంట ఛాన్స్ దొరికిన ప్రతిసారి తన ‘బుజ్జిగాడు’ ‘ఏక్ నిరంజన్’ సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. హిట్ ఇవ్వకపోయినా దర్శకుడు పూరీ రైటింగ్ ని ఎప్పుడూ పొగుడుతూనే ఉంటాడు. వాస్తవానికి ‘బుజ్జిగాడు’ తర్వాతే ప్రభాస్ ని ఎక్కువ మంది ఓన్ చేసుకున్నారు.
Prabhas
అది ఒక ఐకానిక్ క్యారెక్టర్ అయిపోయింది. ‘బుజ్జిగాడు’ క్యారెక్టర్ నుండి ప్రభాస్ చాలా కాలం బయటకి రాలేకపోయాడు అంటే.. దాని ప్రభావం అతనిపై ఏ రేంజ్లో పడిందో అర్ధం చేసుకోవచ్చు. పూరీ విషయంలో ఆ కృతజ్ఞత ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నాడు ప్రభాస్. తాజాగా ‘కపుల్ ఫ్రెండ్లీ’ టీంతో పాల్గొన్న చిట్ చాట్ లో కూడా ప్రభాస్ పూరీ రైటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు.

ప్రభాస్ మాట్లాడుతూ…”పూరీగారిలా ఎవ్వరూ రాయలేరు. ‘బుజ్జిగాడు’ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పినప్పుడు నాకు పిచ్చెక్కిపోయింది. ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు రా బాబు.. ఎలా చేయాలి నేను’ అని అనుకున్నాను. ఆ టైంలో నేను ఎవరితో మాట్లాడినా బుజ్జిగాడు క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఉండేవాడిని.అంతలా ఇన్వాల్వ్ అయిపోయేవాడిని. సూపర్ ఎక్సయిటెడ్ గా ఫీలయ్యేవాడిని.
పూరీగారు డిజైన్ చేసినట్టు హీరో క్యారెక్టరైజేషన్ ని వరల్డ్ లోనే ఎవ్వరూ రాయలేరు అనిపిస్తుంది. తర్వాత ‘ఏక్ నిరంజన్’ కూడా చేశాము.అందులో కూడా బాగా రాశారు. ఆయన రాకపోతే.. అలా ఇమిటేట్ చేయడం కూడా ఎవరి వల్లా కాదు. ‘ఏక్ నిరంజన్’ సినిమాలో కొన్ని డైలాగ్స్ ని ‘దబాంగ్’ వంటిల్లో కూడా పెట్టారు. సోనూ సూద్… పూరీ గారికి ఫోన్ చేసి మరీ ఆ డైలాగ్స్ వాడుకుంటాను అని అడిగారు.
పూరీ కూడా సూపర్ కూల్ కాబట్టి ఓకే అనేశారు” అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మీరు కూడా ఓ లుక్కేయండి :














